పరిస్థితి విషమంగా ఉంది: ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

  • ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ
  • పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్న వైద్యులు
  • ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వెల్లడి
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మెదడులో ఏర్పడిన కణితిని తొలగించేందుకు ఈ నెల 10వ తేదీన ఆపరేషన్ నిర్వహించారు. మరోపక్క కరోనా కూడా సోకింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సర్వత్ర ఆందోళన నెలకొంది. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.  

ప్రణబ్ దాదా ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని... ఇప్పటి వరకు ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.



Pranab Mukherjee
Health Bulletin
Corona Virus

More Telugu News